టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో మేజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే అందరి పాత్రల డబ్బింగ్ కూడా పూర్తయిపోయింది. ఇక రీసెంట్ గానే అడివి శేష్ ఈసినిమా డబ్బింగ్ ను మొదలుపెట్టగా తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు తన డబ్బింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తను వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నా కూడా ఈసినిమా పనులు తన వల్ల లేట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో బిజీ షెడ్యూల్ లో కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు చెబుతున్నాడు. ఇక హిందీలో కూడా అడివి శేష్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ముంబై 26/11 సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. 26/11 ముంబై టెర్రర్ అటాక్లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమాను తీశారు. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈసినిమా రిలీజ్ ఇప్పటికే లేట్ అయిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడటం.. కరోనాతో వచ్చిన సమస్యలతో పాటు ఈమధ్య అడివి శేష్ కు అనారోగ్యానికి గురవ్వడంతో సినిమా షూటింగ్ ఇంకా లేట్ అయ్యింది. ఫైనల్ గా ప్రపంచ వ్యాప్తంగా మేజర్ సినిమాను పిబ్రవరి11న రిలీజ్ చేయబోతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: