అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 లాంటి హిట్ మూవీల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ నెల 17న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా సూపర్ హిట్ తో హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా.. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బన్నీ ఊర మాస్ యాక్టింగ్కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోవైపు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ తో బిజీ అయిపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే తాజాగా హైదరాబాదులో ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పేందుకు థాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక మందన్న, నిర్మాతలు, దేవి శ్రీ ప్రసాద్ తో పాటు సినిమాకు పని చేసిన వారు కూడా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. బన్నీ ఒక కాంప్లెక్స్ యాక్టర్ ప్రశంసించారు. ఆయన అన్ని రకాల ఎమోషన్స్ ని పండించగలరని, అనేక లేయర్స్ ని మిక్స్ చేసి పర్ఫెర్మెన్స్ ని అల్లుకుంటాడని, ఆయన వ్యూవర్స్ ఎక్స్ ప్రెషన్ అని చెప్పారు. అంతేకాకుండా ఈసినిమా కోసం పనిచేసిన యూనిట్ కు ఒక్కొక్కరికీ రూ. 1లక్ష రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు.
కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. మలయాళనటుడు ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్ర పోషించారు. రెండో పార్ట్ పుష్ప- ది రూల్ త్వరలో రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: