సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘రంగస్థలం’. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్చరణ్ నటన పరంగా విమర్శకుల ప్రశంసల సైతం అందుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే రంగస్థలం ముందు రంగస్థలం తరువాత రామ్ చరణ్ అని చెప్పొచ్చు. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రకి ప్రాణం పోసిమరీ నటించాడు. ఇక మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. దాని గురించి స్వయంగా రాజమౌళి హింట్ ఇవ్వడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రాజమౌళి చరణ్-సుకుమార్ సినిమా గురించి ప్రస్తావించి హింట్ ఇచ్చారు. ఇటీవలే సుకుమార్ చరణ్ సినిమాకు సంబంధించి ఓపెనింగ్ సీక్వెన్స్ ను చెప్పాడు.. ఇప్పుడు అది చెప్పకూడదు.. నేను కనుక అది చెప్పేస్తే సుకుమార్ కు హార్ట్ అటాకే వస్తుంది.. కానీ ఆ సీన్ ఖచ్చితంగా హార్డ్ హిట్టింగ్ సీన్ అవుతుందని చెపుతాను అని చెప్పాడు. మరి దీన్నిబట్టి రంగస్థలం తరువాత మరోసారి సుకుమార్-చరణ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందన్న విషయం అర్థమవుతుంది.
కాగా సుకుమార్ రీసెంట్ గానే పుష్ప తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తున్న నేపథ్యంలో సెకండ్ పార్ట్ ను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత వరకూ వచ్చే ఏడాదే సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: