యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈసినిమా కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అస్సలు గ్యాప్ లేకుండా సౌత్ లో నార్త్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే నార్త్ లో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు ఆర్ఆర్ఆర్ బృందం. తాజాగా మరో ప్రెస్ మీట్ లో ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను పలు ప్రశ్నలు అడుగగా.. అందులో ఏ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు అని అడుగగా దానికి ఎన్టీఆర్ ఎలాంటి గ్యాప్ లేకుండా టక్కున జై లవ కుశ సినిమా అని సమాధానమిచ్చాడు. మరి చూద్దాం ఫ్యూచర్ లో ఏమైనా రీమేక్ చేసే ఛాన్స్ లు ఉంటాయేమో. కాగా యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా 2017లో రిలీజ్ అవ్వగాా.. ఈసినిమాలో ఎన్టీఆర్ ఏకంగా మూడు పాత్రల్లో నటించాడు. అందులోనూ నెగిటివ్ షేడ్ లో ఉన్న పాత్రకు మంచి ప్రశంసలు అందుకున్నాడు ఎన్టీఆర్.
కాగా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10,000 థియేటర్లలో దీనిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: