సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నారు.శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. “పుష్ప :ది రైజ్ “మూవీ లో రష్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో రష్మిక నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గ ఉంటూ రష్మిక అభిమానులతో ముచ్చటిస్తూ , తన ఫొటోస్ షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్ రష్మిక ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో 25 మిలియన్ ఫాలోవర్స్ మైలు రాయి చేరుకున్నారు.ఈ అకేషన్ ని రష్మిక ‘బర్త్ డే’ సెలెబ్రేషన్స్ లెవల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. రష్మిక పెద్ద కేకు కట్ చేశారు. తన ఇంటిని 25 సంఖ్యతో కూడిన బెలూన్లతో డెకరేట్ చేసి ఆ ఫోటోలను వీడియోలను షేర్ చేశారు. రష్మిక కు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరుగుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: