క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే నటీనటులు తమ డబ్బింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమలో కీలక పాత్రలో నటిస్తున్న దేవ్ మోహన్ కూడా డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఇక మలయాళం హీరో అయినప్పటికీ తెలుగులో మాత్రం తన పాత్రకు తనే డబ్బింగ్ ను చెప్పుకున్నాడు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దేవ్ మోహన్ తన పాత్ర డబ్బింగ్ ను పూర్తి చేశాడని.. ఎంతో డెడికేషన్ తో తెలుగు నేర్చుకొని మరీ తెలుగులో డబ్బింగ్ చెప్పాడని.. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Our Dushyant @ActorDevMohan wraps up his dubbing for #Shaakuntalam.
With his dedication & determination in learning Telugu & all its nuances-he’s sure to win hearts!@Gunasekhar1 @Samanthaprabhu2@neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official #MythologyforMilennials pic.twitter.com/pM4yWHSdqq— Gunaa Teamworks (@GunaaTeamworks) December 14, 2021
కాగా ఈసినిమాలో అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 2022 ప్రధమార్థంలో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: