మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప “మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టింది. తమిళనాడు లో జరిగిన ఈవెంట్ లో అల్లు అర్జున్ పూర్తిగా తమిళంలో, చాలా స్పష్టంగా మాట్లాడి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. నేటివ్ తమిళియన్ తరహాలో అనర్గళంగా తమిళంలో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ .. తన మూలాలు తమిళనాడులోనే ఉన్నాయనీ , తాను తమిళుడినే అనీ , తాను పుట్టింది మద్రాస్లో అనీ , 20 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇక్కడే ఉన్నాననీ , స్కూల్లో తనతో కలిసి చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్స్, తనకు చదువు చెప్పిన గురువులు అంతా ఇక్కడే ఉన్నారనీ , ఇక్కడ తన సినిమా బాగా ఆడితే చూడాలన్నది తన కల అనీ , సరైన సినిమాతోనే రావాలని ఇంత కాలం ఆగాననీ , “పుష్ప”కచ్చితంగా ఇక్కడి ప్రేక్షకుల కు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అనీ , తిరుపతిలో ఎర్రచందనం చుట్టూ తిరిగే కథ కావడంతో తమిళ ప్రేక్షకులు ఈ సినిమాతో రిలేట్ అవుతారనీ , ఈ చిత్రం ఇక్కడ పెద్ద హిట్టవుతుందని అనుకుంటున్నా ననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: