సూపర్ స్టార్ మహేష్ బాబు కు సర్జరీ అంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఆయన సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తుంది. నిజానికి మహేష్ ఎప్పటినుండో
సమస్యతో ఇబ్బందిపడుతున్నారట. మోకాలినొప్పితో బాధపడుతున్న మహేష్ బాబుకు స్పెయిన్లో ఆపరేషన్ జరిగింది. మహేష్ ప్రస్తుతం దుబాయ్లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న సర్కారు వారి పాట సినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. మహేష్ కోలుకున్నాక మళ్లీ షూట్ లో పాల్గొననున్నారు. మరోవైపు మహేష్ అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మెుదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు.. కానీ ఆతరువాత ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.ఇక కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: