మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. రీఎంట్రి తరువాత మాత్రం వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉండగా ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. గతకొద్ది రోజులుగా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో చిరు సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆవార్తలను కన్ఫామ్ చేస్తూ అఫీషియల్ ప్రకటన వచ్చింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈసినిమా తెరకెక్కుతుండగా ఆ నిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీనికి సహ నిర్మాత గా డా. మాధవి రాజు వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Extremely delighted to announce a film with Megastar @KChiruTweets garu under the direction of Successful Director @VenkyKudumula. It’s a dream come true for us. Co Produced by Dr. Madhavi Raju. Rolling soon… #MegaStarWithMegaFan pic.twitter.com/QyvWAzotss
— DVV Entertainment (@DVVMovies) December 14, 2021
ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేశారు. ఈసినిమాను త్వరలో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్నారు. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఇటీవలే ‘భోళా శంకర్’ సినిమాను కూడా ప్రారంభించారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు బాబి దర్శకత్వంలో వస్తున్న సనిమాను కూడా స్టార్ చేసేశాడు. మరి వచ్చే ఏడాది మాత్రం మెగా ఫ్యాన్స్ కు పండగే అని అర్థమవుతుంది. ఆచార్య ఏలాగూ రిలీజ్ అవుతుంది. దానితో పాటు మరో రెండు సినిమాలు అయినా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: