కరోనా వల్ల చాలా సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఈమధ్యనే కరోనా సెకండ్ వేవ్ తరువాత సినిమాలు మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఇక థియేటర్లలో రిలీజ్ అయినా కూడా ఒకప్పటిలాగ సినిమాలు ఆడే పరిస్థితి లేదు. ఒక వారం రోజులు గట్టిగా ఆడితే గొప్ప అనేలా పరిస్థితి మారిపోయింది. అందుకే థియేటర్లలో రిలీజ్ అయినా కూడా ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక థియేటర్లలో రిలీజ్ అయిన చాాలా సినిమాలు ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. అది క్రిష్-వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన కొండపొలం సినిమా. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఉన్నత చదువు చదుకున్నా కూడా తను అనుకున్న ఉద్యోగం రాకపోవడంతో మళ్లీ తన గ్రామానికే వచ్చి గొర్రెల కాపరి ఎందుకు అయ్యాడు.. ప్రతి చిన్న విషయానికి భయపడే వాడు ఆతరువాత ఎలా మానసికంగా పరిణితి చెందాడు అనే కాన్సెప్ట్ తో ఈసినిమా తీసిన సంగతి తెలిసిందే కదా. ఇక అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Experience The Inspiring & Epic Journey of ‘Becoming’! #KondaPolamonPrime 🐅💥#KondaPolam now streaming on @PrimeVideoIN ▶️ https://t.co/qRd2TDW6HO#PanjaVaisshnavTej @RakulPreet @mmkeeravaani @Gnanashekarvs @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel
— Krish Jagarlamudi (@DirKrish) December 8, 2021
ఈ సినిమాలో వైష్ణవ్తేజ్కు జోడీగా రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో కటారి రవీంద్ర యాదవ్గా వైష్ణవ్, ఓబులమ్మగా రకుల్ కనిపించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: