2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టి జె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన “జై భీమ్” తమిళ మూవీ నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. లాయర్ చంద్రు గా స్టార్ హీరో సూర్య , గిరిజన మహిళ పార్వతి ఇన్ స్పిరేషన్ తో సినతల్లి పాత్రలో లిజో మోల్ జోస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజ జీవితంలో జరిగిన గిరిజన యువకుడి లాకప్ డెత్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు అంతర్జాతీయంగానూ అరుదైన గుర్తింపు లభించింది.ఆస్కార్ అవార్డ్ తరువాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో “జై భీమ్” నామినేట్ అయింది. “జై భీమ్”మూవీ తో పాటు మరో తమిళ మూవీ ‘కూషంగళ్’ కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఇంగ్లిషేతర అత్యుత్తమ సినిమా కేటగిరీలో నామినేట్ అయింది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి తుది జాబితాలో చోటు దక్కించుకున్నా భారతీయ సినిమాకు అరుదైన గౌరవం లభించినట్టే. 2022 సంవత్సరం జనవరి లో లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక జరగనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: