స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్”, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న రెండు ప్రాజెక్ట్స్ కు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ చిత్ర పరిశ్రమ లో ప్లానింగ్ గురించి మాట్లాడుతూ .. జీవితంలో గెలవడానికి ప్రతీ ఒక్కరికీ ప్రణాళికలు అత్యవసరంఅనీ , కానీ , చిత్ర పరిశ్రమ లో ప్లానింగ్ తో పనులు జరగవనీ , మనం ఒకటి అనుకుంటే, మరొకటి జరుగుతుంటుందనీ , ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరనీ , ఒక్క రోజులో జాతకం మారిపోతుందనీ , చిత్ర పరిశ్రమలో సర్ప్రైజ్లు ఎక్కువనీ , అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతుంటాయనీ , ఏదేదో ఊహించుకోవడం, దానికి తగ్గట్టుగా పనిచేయడం కుదరని పననీ , నిజానికి మన ఊహకు అందని ఫలితాలు రావడం కూడా ఒక్కోసారి థ్రిల్ కలిగిస్తుంటుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: