మెగాస్టార్ చిరంజీవి– తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి వస్తున్న సినిమా ఆచార్య. వీళ్లిద్దరూ కలిసి నటిస్తుండటంతో అటు మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ ఇద్దరినీ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ఫిబ్రవరి 4 న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. అయితే ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలాఉండగా ఈసినిమా నుండి తాజాగా రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అయితే టీజర్ మొత్తం ఒక లెక్క అయితే.. టీజర్ చివరిలో వచ్చే ఒక షాట్ మాత్రం మరో లెక్క అన్నట్టుగా టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. ఈ టీజర్ చివరలో నీటి కొలను ఒక వైపు చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే పెద్ద చిరుత కాపాలాగా ఉంటుంది. అదే కొలనుకి మరో వైపు రామ్చరణ్ నీళ్లు తాగుతుంటే చిరంజీవి నిలబడి చూస్తుండటాన్ని చూపించి కొరటాల సినిమాపై అంచనాలను మరో రేంజ్ కు పెంచేశాడు. ఇక ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈషాట్ గురించి కొరటాల తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ షాట్ ఒక్క మెగాస్టార్, మెగా తనయుడు రామ్ చరణ్ లకు మాత్రమే సెట్ అవుతుంది.. ఈ సీన్ తీస్తున్నప్పుడే మంచి హై వస్తుందని అనుకున్నాం.. అలానే రెస్పాన్స్ వస్తుంది. ఈ ఒక్క సీన్ మాత్రమే కాదు చాలా సీన్లు ఇలానే ఆర్గానిక్ గా ఉంటాయి అని చెప్పాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: