టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న కొత్త డైరెక్టర్లలో తరు ణ్ భాస్కర్ కూడా ఒకడు. మొదటిసినిమా పెళ్లి చూపులు తోనే తన సత్తా చాటాడు. చిన్న సినిమా తీసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. ఆ సినిమా తర్వాత తానే హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా కూడా తీసాడు. ఇదిలా ఉండగా వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య దీనిపై ఎలాంటి న్యూస్ కానీ క్లారిటీ కానీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై క్లారిటీ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా దృశ్యం 2. నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తన అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి అడగడం జరిగింది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ తో సినిమా చేస్తున్నారా అన్న ప్రశ్నకు వెంకీ తరుణ్ తో పాటు అందరూ స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నారు. అంతా ప్రిపరేషన్స్ లోనే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే కొత్త సినిమాలేం లేవు.. అన్నీ సెట్ అయ్యాక అప్పుడు స్టార్ట్ చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు.
కాగా దృశ్యం 2 సినిమాలో మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: