భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు ప్రసంశలు కురిపించుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు చిరంజీవి మూడో కన్ను అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ టాలీవుడ్ కి రెండు కళ్ళు అయితే చిరంజీవి మూడో కన్ను అని ఆయన ప్రశంసించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్టీఆర్ తర్వాత తెలుగు భాషకు గుర్తింపు తెచ్చిన వారిలో వెంకయ్య నాయుడు ప్రముఖులు అనీ , అయ్యప్ప సాక్షిగా వెంకయ్యనాయుడు రాష్ట్రపతిగా భారత అత్యున్నత పదవి చేపట్టాలని చిరంజీవి కాంక్షించారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలు అనిర్వచనీయం అంటూ చిరంజీవి కొనియాడారు. ఈ వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ తనకు రాష్ట్రపతి కావాలనే కోరిక లేదనీ , ఉప రాష్ట్రపతి పదవిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను త్వరగా నిద్రపోతున్నాననీ , జనానికి దూరంగా ఉండడం తనకు ఇష్టం ఉండదనీ , అయితే తాను రాష్ట్రపతి కావాలని చాలా మంది కోరుకొంటున్నారన్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.