మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే
ఓ ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడిగా మారితే రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులు ఎలా ఉంటాయి అన్న నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది అన్న వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. ఇక రీసెంట్ గా ఈసినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం పూణెలో ఈసినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక శంకర్ సినిమా కాబట్టి ఇందులో కాస్టింగ్ విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ ఉండదని మనకు తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఇందులో ప్రధాన విలన్ గా మలయాళం స్టార్ సురేష్ గోపీని తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు ఈసినిమాలో ఈషా గుప్తా కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: