శంకర్-చరణ్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాకోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో ఉండటంతో శంకర్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ ను పక్కా ప్లాన్ తో శంకర్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ ను పూణెలో స్టార్ట్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనికోసం అక్కడ ఒక భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు చిత్రయూనిట్. ఇక ఈషెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన సీన్స్ తో పాటు ఒక పాటను షూట్ చేయాలనుకుంటున్నారు. ముందుగానే షూట్ కు సంబంధించి అన్ని విషయాలు ప్లాన్ చేసుకున్నారట మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా అంజలి, సునీల్, శ్రీకాంత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దిల్ రాజు కెరీర్ లో వస్తున్న 50వ సినిమా కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈసినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే పలు కథనాలు అందుకున్నాయి. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: