మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.“సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ ప్రస్తుతం స్పెయిన్ దేశంలో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు , తమిళ , మలయాళ చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ లో పాల్గొనటానికై చెన్నై నుండి స్పెయిన్ ప్రయాణమయ్యారు. ఆ విషయాన్ని కీర్తి సురేష్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: