టాలీవుడ్ లో మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో గోపీచంద్ ఇటీవలే సిటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సీటీమార్ సినిమాతో మంచి విజయం దక్కించుకున్నాడు. సీటీమార్ సక్సెస్ సాధించడంతో ఇక ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆరడుగుల బుల్లెట్ “. ఇప్పటికే రెండు మూడుసార్లు ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 8న విడుదల కానుండటంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడ్ పెంచారు. ఈనేపథ్యంలోనే నేడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. కామెడితో పాటు యాక్షన్ సీన్స్తో ట్రైలర్ను ఆసక్తికరంగా తెరకెక్కించారు.’పరిచయం అయితే నేను మర్చిపోను. పంగా అయితే నువ్వు మర్చిపోలేవు, ‘డబ్బులిచ్చే నాన్నను చూసి ఉంటావు… అప్పులిచ్చే నాన్నను ఎక్కడైనా చూశావా?’ వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Action packed powerful trailer of @YoursGopichand‘s #AaradugulaBullet ! Out now on @telugufilmnagar ! 🔥🔥
In theatres from 8th October #Gopichand #Nayanthara #BGopal #Manisharma #ThandraRamesh #VakkanthamVamsi #JayaBalajeeRealMedia @MangoMusicLabel pic.twitter.com/t1E0H6cu5E
— Telugu FilmNagar (@telugufilmnagar) October 4, 2021
కాగా జై బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో ప్రకాష్ రాజ్ ,అభిమన్యు సింగ్ , కోట , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. మరి కొత్త కొత్త కథలు వస్తుండగా.. ఎప్పుడో రాసిన కథతో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఎంతమేరకు మెప్పిస్తుందో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: