మొత్తానికి ప్రభాస్ ఈసారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రావడానికి సిద్దమయ్యాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఆ తరువాత అన్నీ పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ లిస్ట్ లో నాలుగు భారీ బడ్జెట్ అండ్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఉన్నాాయి. అందులో రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇంకా ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ ఇంకా నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ దశలోనే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలు ఇంకా షూటింగ్ దశలో ఉండగానే తన సిల్వర్ జూబ్లీ సినిమాను కూడా వెంటనే లైన్ లో పెట్టనున్నట్టు తెలుస్తుంది. నిజానికి రాధేశ్యామ్ సినిమా ప్రభాస్ 20వ సినిమా. అలానే ఆది పురుష్ 21, సలార్ 22, నాగ్ అశ్విన్ సినిమా 23వ సినిమా కాగా 24వ సినిమా సిద్ధార్ధ్ ఆనంద్తో చేయనున్నట్టు సమాచారం. ఇక గత కొద్ది రోజులుగా ప్రభాస్25 సినిమా గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమాపై అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారు. ఈ నెల 7వ తేదీన ప్రభాస్ 25వ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది. మరి ఆ సినిమాకి దర్శకుడు ఎవరు? ఎవరి బ్యానర్లో ఎప్పుడు మొదలుకానుంది? అనే విషయాలు ఆ రోజున తెలిసే అవకాశం ఉంది.
#Prabhas25 Announcement on October 7th pic.twitter.com/JPf0E9G5Sq
— Sreedhar Pillai (@sri50) October 4, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: