సాయి తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న సినిమా రిపబ్లిక్. ఇందులో కలెక్టర్ పంజా అభిరామ్ పాత్రలో సాయితేజ్నటించనున్నాడు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇటీవల బైక్ యాక్సిడెంట్లో గాయపడ్డ సాయితేజ్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సాయి తేజ్ లేకపోయినా కూడా ఈసినిమాను అనుకున్న డేట్ కే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే చిత్రయూనిట్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలను బ్రేక్ లేకుండా చేస్తున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సెప్టెంబర్ 22 వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలకు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈసినిమా ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: