మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయిక గా రూపొందిన రవితేజ “క్రాక్ “, పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్ “మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన “లాభం”తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ , శృతి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందనే వార్తలు ఇప్పటికే అందరిలోనూ భయాందోళనలు కలిగిస్తున్న విషయం తెలిసిందే . సినిమా పరిశ్రమలో కోవిడ్ నియమ, నిబంధనలతో షూటింగ్స్ జరుగుతున్నాయి. షూటింగ్ కోసం ఓ చోట నుంచి మరో చోటకు వెళ్లాల్సి ఉంటుంది. అలా ప్రయాణించిన ప్రతీసారీ కరోనా పరీక్షలు చేయించుకోడం తప్పనిసరి. అలా హీరో హీరోయిన్లకు మాత్రం ఎన్నో సార్లు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ షూటింగ్స్ కై ముంబై, చెన్నై, హైద్రాబాద్ అంటూ తిరుగుతూ ఉన్నారు.”సలార్”మూవీ షూటింగ్లో శృతి ఫుల్ బిజీగా ఉన్నారు. రోజూ షూటింగ్ సెట్కు వెళ్లే ముందు కూడా కరోనా పరీక్షలు చేయిస్తున్నట్టు సమాచారం. తాను ఇప్పటికి ఐదు వేల సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాననీ , సేఫ్టీనే ఫస్ట్ కదా అని శ్రుతీ హాసన్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: