సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా కబడ్డీ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ” సీటీమార్ ” విడుదలకు సిద్ధంగాఉంది. బి గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ ,నయనతార జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆరడుగుల బుల్లెట్ “మూవీ కూడా రిలీజ్ కానుంది. హీరో గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పక్కా కమర్షియల్ “మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు మరో మూవీ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు శ్రీవాస్ , హీరో గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందిన “లక్ష్యం “, “లౌక్యం ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “#GOPICHAND 30” మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో విలన్ పాత్రకై సీనియర్ హీరో రాజశేఖర్ ను దర్శకుడు సంప్రదించినట్టుసమాచారం . కొంత కాలం క్రితమే విలన్ పాత్రలకు సిద్ధం అని రాజశేఖర్ చెప్పిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: