అడివి శేష్ ,శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన గూఢచారి సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. 2018లో విడుదలైన ఈ తెలుగు స్పై థ్రిల్లర్ అందరికీ నచ్చింది. ఒక రకంగా ఈసినిమానే అడివి శేష్ ను హీరోగా నిలబెట్టింది. ఇక ఈసినిమా వచ్చి ఇప్పటికి మూడేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా అడివి శేష్ తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమాను గుర్తుచేసుకుంటూ ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా అప్ డేట్ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఈ రోజుతో గూఢచారికి మూడేళ్లు. నాకు అత్యంత ఇష్టమైన చిత్రం. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే సినిమా ఇది. ఆగష్ట్ ఎప్పుడూ నాకు లక్కీ మంత్ కాబట్టి, ఈ నెల చివరిలో నెక్స్ట్ మిషన్ భారీ అప్డేట్.. గూఢచారి ప్రకటన త్వరలో వస్తుంది!” అంటూ ట్వీట్ చేశారు.
It’s #3YearsforGoodachari today 🙂
My most loved film.
It is especially The film children love the most.
Since August has always been a lucky month for me, a huge update of the next mission later this month!#G2
Announcement coming soon! pic.twitter.com/nD5RtlE7iw
— Adivi Sesh (@AdiviSesh) August 3, 2021
ఇక ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు అడివి శేష్. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: