మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయంరవి , ఐశ్వర్య రాయ్ , త్రిష లతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న “పొన్నియిన్ సెల్వన్ “మూవీ థాయ్ ల్యాండ్ లో 40 రోజుల షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. 6రోజుల సెకండ్ షెడ్యూల్ పుదుచ్చేరి లో కంప్లీట్ అయ్యింది. పొల్లాచి లో మైనర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న “పొన్నియిన్ సెల్వన్ “మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రధాన తారాగణం తో మేజర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ షూటింగ్ పాండిచ్చేరి లో పునః ప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్ షడ్యూల్ లో ఐశ్వర్య రాయ్ , ఐశ్వర్య లక్ష్మి జాయిన్ అయ్యారు. పాండిచ్చేరి లో ఒక చిన్న షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని చిత్ర యూనిట్ ఒక నెల లాంగ్ షెడ్యూల్ కై హైదరాబాద్ చేరుకుంటుంది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న”పొన్నియిన్ సెల్వన్ ” మూవీ ఫస్ట్ పార్ట్ 2022 లో రిలీజ్ కానుందని ఐశ్వర్య రాయ్ ఒక పోస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: