గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇంకా దీనితో పాటు మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు గోపీచంద్. మరోవైపు ఎన్నో ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న ఆరడుగుల బుల్లెట్ సినిమా కూడా రిలీజ్ కానుంది. థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలు రిలీజ్ కాకముందే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ‘లక్ష్యం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ హీరో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చి న మరో చిత్రం ‘లౌక్యం’ రాగా అది కూడా హిట్ గానే నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రానుంది. దీనికి సంబంధించి ఈరోజు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
We are happy to associate with the sensational hattrick combo @YoursGopichand & @DirectorSriwass for #Gopichand30.
Produced by @vishwaprasadtg, co-produced by @vivekkuchibotla under @peoplemediafcy banner.
A complete family entertainer, Shoot begins soon! pic.twitter.com/5W6X3WwSkJ
— People Media Factory (@peoplemediafcy) July 14, 2021
కాగా పీపుల్మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇక పోస్టర్ లో కోల్కత్తాలోని హౌరా బ్రిడ్జి, ఫేమస్ కాళీమాత విగ్రహం కనిపిస్తున్నాయి. దీంతో ఈసినిమా కోల్కతా బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్నట్టు అర్థమవుతుంది. భారీ బడ్జెట్ తోనే ఈసినిమాను రూపొందించనున్నారు. ఇక ఈసినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: