శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహాసముద్రం’. ఇప్పటికే విడుదల అయిన శర్వా, సిద్ధార్థ్, రావు రమేష్ పోస్టర్స్ ఆకట్టుకోగా.. రీసెంట్ గా విడుదల చేసిన గరుడ రామ్ పోస్టర్ సినిమాపై ఇంకా అంచనాలు పెంచేసింది. ఇక ఈసినిమా షూటింగ్ కూడా చాలా లేట్ గానే మొదలైంది. అయితే సెట్స్ పైకి వెళ్లిన తరువాత అజయ్ భూపతి చాలా తొందరగానే సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈసినిమా కంటే ముందు మొదలైన సినిమాలే ఇంకా షూటింగ్ ను పూర్తి చేసుకోలేకపోయాయి. కానీ మహాసముద్రం సినిమా మొదలవ్వడమే చాలా లేట్ గా మొదలైంది. కానీ కరోనా వల్ల బ్రేక్ లు వచ్చినా కూడా తొందరగానే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: