విజన్ సినిమాస్ బ్యానర్ పై ఎమ్ వీరభద్రం దర్శకత్వంలో ఆది సాయికుమార్ , పాయల్ రాజ్ పుత్ జంటగా క్రైమ్ థ్రిల్లర్ “కిరాతక” మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 వ తేదీ ప్రారంభం కానుంది. పూర్ణ, దాసరి అరుణ్కుమార్, దేవ్గిల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. “కిరాతక “ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ .. “కిరాతక ” మూవీ విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశమనీ , హీరో ఆది పాత్ర సరికొత్త కోణంలో సాగుతుందనీ , పాయల్రాజ్పుత్ పాత్ర ప్రేక్షకుల్ని థ్రిల్కు గురిచేస్తుందనీ , ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందనీ చెప్పారు. కథానాయిక పాయల్ మాట్లాడుతూ .. ఈ కథ తనకు బాగా నచ్చిందనీ, అభినయానికి మంచి ఆస్కారం ఉన్న పాత్ర దొరకడం సంతోషంగా ఉందనీ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ .. టైటిల్కు మంచి స్పందన లభిస్తోందనీ , వైవిధ్యమైన క్రైమ్ థ్రిల్లర్గా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందనీ , తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందనీ అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: