ప్రభాస్ కు ఇప్పుడు ఏ స్థాయిలో గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. ప్రాంతీయ స్థాయి నుండి దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇంత పాలోయింగ్ కు కారణం ఏంటో కూడా తెలుసు కదా. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్.. ఆ తరువాత వచ్చిన సాహోతో జాతీయ స్థాయిలో పేరు సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది అన్నీ పాన్ ఇండియా సినిమాలే అవ్వడంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హైదరాబాద్ టైమ్స్ ‘ఫరెవర్ డిజైరబుల్ మెన్’ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. హైదరాబాద్ టైమ్స్ వారు ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ – మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను విడుదల చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా 2020 సంవత్సరానికి గాను లిస్టును ప్రకటించింది. మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో నంబర్ వన్ గా విజయ్ దేవరకొండ.. నంబర్ 2గా రామ్. తారక్ .. రామ్ చరణ్ 3- 4 స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఈ లిస్ట్ లో ప్రభాస్ పేరు ఉండదు. ఎందుకంటే ఫరెవర్ డిజైరబుల్ మెన్ అనేది అంతకంటే కాస్త ఎక్కువ కాబట్టి. ఈనేపథ్యంలో ఈ ఏడాది ప్రభాస్ ను ఫరెవర్ డిజైరబుల్ మెన్ గా ప్రకటించారు. గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ లిస్టులో చేర్చిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న రాధేశ్యామ్ సినిమా.. తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: