మొదటినుండి గుణశేఖర్ విభన్నమైన సినిమాలు చేస్తూవుండటం చూస్తున్నాం. మనోహరం, ఒక్కడు, రుద్రమదేవి వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమా చేస్తున్నాడు. మహాభారతంలోని ఆదిపర్వంలో అద్భుతమైన, అందమైన ప్రేమ కథను శాకుంతలం చిత్రంగా ఆవిష్కరించనున్నాడు గుణశేఖర్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఎక్కువ శాతం షూటింగ్ ప్రత్యేక మైన సెట్ లో జరుపుకోనుంది. కరోనా వల్ల షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ బ్రేక్ టైమ్ ను గుణశేఖర్ బాగానే వాడుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ టైమ్ లో తను తన తర్వాత ప్రాజెక్ట్ ప్రతాప రుద్ర స్క్రిప్ట్ ను రాసే పనిలో పడ్డాడట. కాకతీయ వంశంలో ప్రతాప రుద్ర ఆఖరి రాజు.. రాణి రుద్రమదేవి మనవడు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ను రాసే పనిలో పడ్డాడట గుణశేఖర్. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయినతర్వాత ఓ స్టార్ హీరోకు కథను వినిపించనున్నాడట. అన్నీ ఓకే అయితే శాకుంతలం, హిరణ్యకశ్యప సినిమా తరువాత ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు. చూద్దాం మరి గుణశేఖర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందేమో…
ఇక రానాతో కూడా కలిసి హిరణ్యకశ్యప సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఓ హాలీవుడ్ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి కూడా మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: