బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. బాలయ్య ఈ చిత్రంలో ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా రెండు పాత్రల్లో చేస్తున్నాడు. ఈమధ్యనే ఈసినిమా టైటిల్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలుసు కదా. యూట్యూబ్ లో ఇప్పటివరకు 25 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని సీనియర్ హీరోల్లో తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ అందుకున్న టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. ఇక ప్రస్తుతం చివరి దశకు వచ్చేసింది. ఈనేపథ్యంలో కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం.
ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడట. వాటిలో రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. మే 28న ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.. మరి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అది కుదురుతుందో లేదో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: