జీతూజోసఫ్ దర్శకత్వంలో వెంకీ హీరోగా దృశ్యం సీక్వెల్ దృశ్యం 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్ తో చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన పోర్షన్స్ మొత్తం పూర్తి చేసినట్టు తెలుస్తుంది. వెంకీ ఈసినిమా కంటే ముందు మొదలు పెట్టిన ఎఫ్ 3 సినిమా కూడా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. కానీ ఈసినిమా షూటింగ్ మాత్రం దాదాపు చివరి దశకు వచ్చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఏప్రిల్ చివరికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ను అంత త్వరగా పూర్తి చేయడానికి కారణం సినిమాను ఒక స్పెషల్ డే రోజు రిలీజ్ చేయడానికేనట. ఈ స్పెషల్ డే ఏదో కాదు ఫాదర్స్ డే. జాన్ 20 న ఫాదర్స్ డే రోజు కావడంతో ఈసినిమాను ఆరోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు ఒక మధ్యతరగతి తండ్రి చేసే పోరాటమే ఈసినిమా కాబట్టి.. అంతకుమించిన మంచి రోజు ఉండదని అందుకే ఆ రోజు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఈ సినిమా తొలి భాగం రీమేక్లో నటించిన వెంకటేష్, మీనా ఇప్పుడు సీక్వెల్ రీమేక్లోనూ నటిస్తున్నారు.
కృతిక, ఎస్తేర్, నదియా, వారితో పాటు సంపత్ రాజ్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి. సురేష్బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: