‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ ఇలా వరుస హిట్స్ తో టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న నటుల్లో అడివి శేష్ కూడా ఒకడు. మొదటి నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ లే ఎంచుకుంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు. అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి టీజర్ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాేేజల వల్ల టీజర్ రిలీజ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమా నుంచి ‘లెటర్ టు సందీప్’ పేరిట ఓ అప్డేట్ రాబోతున్నట్లు హీరో ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఆ ఆప్ డేట్ ఇచ్చేశాడు ఇప్పుడు. ఆమె ప్రేమ అతని మీద… అతని ప్రేమ దేశం మీద అంటూ టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఏప్రిల్ 12న టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
Her love for him is as endearing as his love for his country.#MajorTeaserOnApril12 🔥#PeopleOfMajor #MajorTheFilm@AdiviSesh @sobhitaD @saieemmanjrekar @sonypicsfilmsin @sonypicsindia @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @vivekkrishnani @MajorTheFilm pic.twitter.com/Kmg9RwsNdq
— GMB Entertainment (@GMBents) April 3, 2021
కాగా ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల `దబాంగ్ 3`బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూపర్స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: