నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్ “మూవీ నిన్న పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని తండ్రి క్లాప్ కొట్టగా , దర్శకుడు మేర్లపాక గాంధీ స్విచ్చాన్ చేశారు. ఈ సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. “శ్యామ్ సింగ రాయ్ “మూవీలో ముగ్గురు కథానాయికలలో సాయి పల్లవి , కృతి శెట్టి ఎంపిక అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” మూవీ తో మడోన్నా సెబాస్టియన్ కెరీర్ ప్రారంభించారు. “ప్రేమమ్ “మూవీ తో కోలీవుడ్ , టాలీవుడ్ లకు మడోన్నా పరిచయం అయ్యారు. పలు మలయాళ , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మడోన్నా ప్రస్తుతం ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు. “కోటిగొబ్బ 3 ” మూవీ తో మడోన్నా కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. మడోన్నా ఇప్పుడు “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో మూడవ కథానాయిక గా ఎంపిక అయ్యారు. సుమారు 5 సంవత్సరాల తరువాత మడోన్నా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: