ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఇక ఇది సెట్స్లో ఉండగానే ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాకి, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ తో మరో సినిమాను లైన్ లో పెట్టాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి ‘సలార్’ టైటిల్ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం ప్రభాస్ నే ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెపుతున్నాడు ప్రశాంత్ నీల్. కథకు ప్రభాస్ తప్ప మరో హీరో సెట్ అవ్వడు.. అమాయకంగా ఉంటూనే క్రూరంగా ఉండాలి.. క్రూరంగా ఉంటూనే నాయకుడిగా ఎలా మారాడో నా సినిమాలో చూపించబోతున్నా. నా కథకు ప్రభాస్ కరెక్ట్గా సరిపోతాడు.వ్ అని క్లారిటీ ఇచ్చాడు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా వచ్చిన `కె.జి.ఎఫ్- చాప్టర్ 1` సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కె.జి.ఎఫ్- చాప్టర్ 2 కూడా వస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో.మరి చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చుద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: