క్రైమ్‌ డ్రామాగా తరుణ్ భాస్కర్ మూడో సినిమా

Pelli Choopulu Movie Fame Director Tharun Bhascker To Make A Crime Drama Movie

తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా ఒక మాదిరిగానే ఆడింది. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా కూడా తీసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఆ మధ్య తరుణ్ భాస్కర్ వెంకీ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తాజాగా తన మూడో ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. నా 3వ సినిమా నన్ను చాలా ఇబ్బందుల్లో పెట్టింది. రెండు పెద్ద ప్రాజెక్ట్‌లు చేసే అవకాశం వచ్చింది.. వీటిలో ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైంది. బాగా ఆలోచించిన తర్వాత క్రైమ్‌ డ్రామాతో సినిమా తెరకెక్కిద్దాం అని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో ఓ ప్రముఖ స్టార్‌ హీరో నటించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని అస్సలు నిరుత్సాహపరచదు అని తన ఇన్స్టాలో పోస్ట్ చేసాడు. చూద్దాం మరి ఆ హీరో ఎవరో.. ఆ కథ ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

 

 

View this post on Instagram

 

A post shared by Mr.Bhascker (@tharunbhascker)

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − three =