సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చినా… అధికారికంగా మాత్రం పట్టాలెక్కలేదు. ఇక దానికితోడు తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు. ఈ సినిమాను అధికారికంగా ఈరోజు లాంచ్ చేశారు. మహేష్ బాబు తనయి సితార క్లాప్ కొట్టగా, భార్య నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మూవీ రెగ్యూలర్ షూట్ జనవరి మొదటి వారం నుండి జరగనుంది. 2021 దసరాకు సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సర్కారు వారి పాట సినిమా లాంచ్ పై పూరీ ట్వీట్ చేశాడు. పరుశురాం చేసిన ట్వీట్ కు రిప్లైఇస్తూ.. మోస్ట్ ఎక్జైటెడ్ వెంచర్ అని.. నేను ముంబైలో ఉండటం వల్ల పూజా కార్యక్రమానికి రాలేకపోయాను. నీకు నా లవ్ ఎప్పుడూ ఉంటుంది..చిత్రయూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్.. మహేశ్ బాబు అభిమానులకు ఈ సినిమా బిగ్ ట్రీట్ అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
Congratulations @ParasuramPetla for ur most exciting venture #SarkaruVaariPaata
I am held up in mumbai and missed attending the Pooja ceremony today.
my love to u always.
all the best to the entire team, this is surely gonna be a big treat to all @urstrulyMahesh fans 💪🏽 https://t.co/iaDB5QRKKf— PURIJAGAN (@purijagan) November 21, 2020
కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పలు పాటలు కంపోజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: