ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనితో పాటుసితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు యంగ్ హీరో నాగశౌర్య వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. మరో సినిమాను కూడా ఇటీవలే ప్రకటించాడు. డైరెక్టర్ అనీష్ కృష్ణతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి జరగనుంది.
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు చిత్రయూనిట్. ఆక్లాండ్కు చెందిన, ఫోర్బ్స్ మ్యాగజైన్లో స్థానం పొందిన సంచలన గాయని, నటి షిర్లీ సేతియా ఈ మూవీలో నాగశౌర్య జోడీగా ఎంపికయ్యారు. ‘మస్కా’తో నటిగా మారిన షిర్లీ, త్వరలో ‘నికమ్మా’ చిత్రంతో బాలీవుడ్లోనూ పరిచయం అవుతున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. దర్శకునిగా అనీష్ కృష్ణకు ఇది మూడో సినిమా. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: