టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి అక్టోబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూతో వివాహం జరిగింది. ముంబయిలోని ఓ హోటల్లో ఇరు కుటుంబసభ్యులు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక విహహం తర్వాత కాజల్ తన ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇటీవల మొదటి కార్వా చౌత్ని జరుపుకున్న కాజల్ ఆ ఫొటోస్ కూడా షేర్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా త్వరలోనే ఈ జంట హనీమూన్కు కూడా బయలుదేరుతున్నట్టు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో తను పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తేనే అర్ధమవుతుంది. బ్యాగ్లు, పాస్ట్పోర్ట్లు ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. `బ్యాగులు సర్దేసుకున్నాం`, `రెడీ టు గో` అంటూ విమానం ఎమోజీలు ఉన్న పొటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసింది.
కాగా నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2లలో నటిస్తుంది. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తుంది. హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత `ఆచార్య` షూటింగ్కు కాజల్ హాజరుకాబోతున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: