ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాతో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయాడు. అయితే తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు. అయితే ఈ మధ్యనే షూటింగ్ లు మొదలుపెట్టారు. చాలా సినిమాలు చివరిదశలోనే ఉండగా ముందు వారు మాత్రం షూటింగ్ లను మొదలుపెట్టి పూర్తి చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సర్కారు వారి పాట సినిమా షూటింగ్ అసలు ఇంకా మొదలు కాలేదు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అప్పటికే లాక్ డౌన్ విధించడం జరిగింది. షూటింగ్ ను నవంబర్ నుంచి ప్రారంభించాలి అనుకున్నారు కానీ.. స్టార్ట్ అవ్వలేదు. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చేఏడాది 2021 జనవరి నుండి సెట్స్ పైకి తీసుకెళ్లాలన్న ప్లాన్ లో ఉన్నారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే ఇవ్వనున్నారట.
కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పలు పాటలు కంపోజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: