ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక సాయి పల్లవి ఎంత సింపుల్ గా ఉంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత స్టార్ డమ్ ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అంతే కాదు ప్రకృతి అంటే కూడా తనకు ఎంత ఇష్టమో ఎన్నో సందర్భాల్లో చూసాం కూడా. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి సాయి పల్లవి తన ఇన్స్టా ద్వారా పోస్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం శేఖర్ కమ్ముల `లవ్స్టోరీ` షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో కలిసి సాయిపల్లవి ఈ షూటింగ్ లో పాల్గొంది. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న ఒక ఫొటోను తాజాగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇక ఫొటో చూస్తుంటే సాయి పల్లవి ప్రకృతి ఒడిలో, చల్లటి గాలిలో సేదతీరుతున్నట్టు కనిపిస్తుంది. ఇక ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
దీనితో పాటు ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: