వీక్లీ రౌండప్.. లేటెస్ట్ మూవీ అప్ డేట్స్ మీ కోసం

Weekly roundup: Check out the latest movie updates for this week

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు ‘దితెలుగుఫిలింనగర్ .కమ్’ ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమెజాన్ ప్రైమ్ లో ‘నిశ్శబ్దం’

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్స్ లేవు కాబట్టే ఓటీటీ కే మొగ్గు చూపారు చిత్ర యూనిట్. వచ్చే నెల అంటే అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు.

 

‘శైలపుత్రీదేవి’ గా నిత్యా మీనన్

సుజ‌నా రావు దర్శకత్వంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో వస్తున్న సినిమా ‘గ‌మ‌నం’. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నిత్యా శైలపుత్రీదేవి అనే శాస్త్రీయ సంగీత గాయని పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నిత్యామీనన్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

 

అఫీషియల్ ‘మ‌హాస‌ముద్రం’ లో సిద్ధార్థ్

‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజ‌య్ భూప‌తి డైరెక్షన్ లో రానున్న ‘మహాసముద్రం’ సినిమాపై ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. టాలెంటెడ్ నటుడు శ‌ర్వానంద్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో మరో హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఇక ఇప్పుడు దీనిపై కూడా అధికారిక ప్రకటన ఇచ్చేసారు. ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

 

ఉపేంద్ర ‘కబ్జ’ థీమ్‌ పోస్టర్‌ రిలీజ్

కన్నడ హీరో ఉపేంద్ర ‘కబ్జ’ అనే మరో విభిన్నమైన సినిమాతో వస్తున్నాడు. 1980 ల కాలంనాటి పరిస్థితుల నేపథ్యం లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా థీమ్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

#NS20 మూవీ షూటింగ్ ప్రారంభం

సోనాలి నారంగ్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా ” #NS20 “మూవీ షూటింగ్ నిన్న (బుధవారం ) హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య కు జోడీగా “రొమాంటిక్ ” మూవీ ఫేమ్ కేతిక శర్మ నటిస్తున్నారు.

ప్రభాస్ ఛాలెంజ్ పూర్తిచేసిన శ్రద్దా

ప్రభాస్ నుంచి గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన శ్రద్ధా కపూర్ ఈ రోజు ముంబైలోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసింది. తనను నామినేట్ చేసినందుకు ప్రభాస్ కు థ్యాంక్స్ చెపుతూ.. సమాజానికి ఎంతో మేలు చేసే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు తీసుకెళుతున్న రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

డైరెక్షన్ పై నిఖిల్ క్లారిటీ

హీరో నిఖిల్ డైరెక్టర్ గా మారబోతున్నాడని.. ఒక ఎక్స్పెరిమెంటల్ చిల్డ్రన్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించిన నిఖిల్ తన డైరెక్షన్ పై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నేను నటిస్తున్న రెండు చిత్రాలు 18 పేజీస్‌, కార్తికేయ 2 సినిమాలు అక్టోబర్‌, నవంబర్‌ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రాల షూటింగ్స్‌తో నేను ఫుల్‌ బిజీ అవుతున్నాను. త్వరలోనే థియేటర్స్‌లో కలుద్దాం” అని క్లారిటీ ఇచ్చాడు‌.

 

కరోనా పాజిటివ్

టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. మరో లెజెండ్రీ డైరెక్టర్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. సింగీతం శ్రీనివాసరావు. ఈ విష‌యాన్ని వీడియో ద్వారా స్వ‌యంగా వెల్ల‌డించారు సింగీతం.

 

 

‘ఆదిపురుష్’ కోసం ‘కీరవాణి’..?

తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా టాప్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ని సెట్‌ చేయాలని ఓంరౌత్‌ చూస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఎమ్‌.ఎమ్‌. కీరవాణి పేరు వినిపిస్తుంది. కీరవాణి ని ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసిందాకా వెయిట్ చేయాల్సిందే.

ప్రియదర్శి ‘కంబాలపల్లి కథలు’

పెళ్లి చూపులు సినిమాలో తన తెలంగాణ డైలాగ్స్ తో అందరినీ నవ్వించిన ప్రియదర్శి ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రియదర్శి.
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అనుబంధం సంస్థ స్వప్న సినిమాస్‌ బ్యానర్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మితమవుతోంది. ‘కంబాలపల్లి కథలు’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ తాజాగా ప్రారంభమైంది. ఉదయ్‌ గుర్రాల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సిరీస్ లో ప్రియదర్శి హైబత్‌ అనే పాత్రలో నటిస్తున్నారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 2 =