ఈ ఏడాది ‘జాను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. అయితే ఆ సినిమా అంత విజయం అందించలేకపోయింది. ఇక జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగు-తమిళ భాషలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు శర్వా మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ విషయాన్నీ అఫిషియల్గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్) బ్యానర్పై నారాయణ్దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు..? అలాగే హీరోయిన్ మిగితా నటీనటుల వివరాలను త్వరలోనే తెలుపనున్నారు.
కాగా ఇటీవల హీరో నిఖిల్ 20వ సినిమాని నిర్మించనున్నట్లు శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకదాని తర్వాత ఒకటిగా చిత్రాలు నిర్మించేందుకు శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్టర్, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.
ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ను ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: