హెచ్ వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ వాలిమై సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికారిక ప్రకటన అయితే రాలేదులే కానీ గతకొంత కాలంగా ఈ వార్త వినిపిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు అజిత్ గురించి కార్తికేయ చేసిన ట్వీట్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ్ సూపర్ స్టార్ అజిత్ వెండితెరకు పరిచయమై 28ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా కార్తికేయ తన ట్విట్టర్ లో.. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు పరిచయమై.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తమిళ్ సినిమా పరిశ్రమకు.. సినీ ప్రేక్షకులకు తాలా అజిత్ అయ్యారు. మీ జర్నీ లోని ప్రతిఒక్క పేజీ ఒక ఇన్స్పిరేషన్.. సినీ పరిశ్రమకు వచ్చి 28 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు అభినందనలు అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేసాడు. మరి ఇప్పటికే నాని హీరోగా రూపొందిన “గ్యాంగ్ లీడర్ ” మూవీ లో విలన్ గా నటించగా మంచి ప్రశంసలు దక్కాయి కార్తికేయకు. మరి ఈ సినిమాలో కనుక విలన్ గా నటిస్తే ఎలా చేస్తాడో చూద్దాం.
Coming from a non filmy background facing many difficulties, many failures, coming out stronger each and everytime and becoming THALA of Tamil cinema ..every page in your journey can be taken as an inspiration sir..congratulations on completing 28years#28YrsOfSELFMADETHALAAjith pic.twitter.com/XU2xFeXhIu
— Kartikeya Gummakonda (@ActorKartikeya) August 3, 2020
కాగా కార్తికేయ ప్రస్తుతం ‘చావు కబురు చల్లగా’ లో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతలుగా.. కౌశిక్.పి- సునీల్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో బస్తీ బాలరాజుగా కార్తికేయ నటిస్తున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: