టాలీవుడ్ సెలబ్రిటీస్ ను కూడా కరోనా వదలట్లేదు. షూటింగ్ లు మొదలు పెట్టిన వాళ్లకూ వస్తుంది… షూటింగ్ లకు వెళ్లని వాళ్లకు కూడా వస్తుంది. మొన్నటికి మొన్న టాలీవుడ్లో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో వున్నాడు. ఇక ఇప్పుడు ఈ వార్త మరిచిపోకముందే మరో డైరెక్టర్ కూడా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు తేజకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో తేజ పాల్గొన్నట్టు సమాచారం. దీంతో ఆయనతో పని చేసిన యూనిట్ సబ్యులకు, అలాగే కుటుంబ సభ్యులకు కారోనా టెస్టులు చేయగా తేజకు పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీనితో ప్రస్తుతం తేజ హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు తేజ. ఇక ఇప్పుడు వరుసగా రెండు సినిమాలతో వస్తున్నాడు. అందులో ఒకటి . ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఎప్పుడో ఈ రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో ‘రాక్షసరాజు రావణాసురుడు’రానా నటిస్తుండగా ‘అలివేలుమంగ వెంకటరమణ’ చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: