ఫ్యాన్స్ అంటే ఏదో తమ అభిమాన హీరో సినిమా చూశామా.. సోషల్ మీడియాలో సపోర్ట్ చేశామా అన్నట్టు కాకుండా సమాజ సేవ చేయడంలో కూడా ముందుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు మరోసారి అలాంటి పనిచేసి శభాష్ అనిపించుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అసలు సంగతేంటో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనంతపురంకు చెందిన భార్గవి ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్. ఇక తన తల్లి రెండేళ్ల క్రితమే మరణించింది. ఆ తర్వాత తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. దీనితో భార్గవి తన సోదరుడు, సోదరి ముగ్గురు అనాథలయ్యారు. వాళ్ళ బంధువుల ఇంట్లోఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఇటీవలే భార్గవి కూడా వ్యక్తిగత కారణాలవల్ల సూసైడ్ చేసుకొని మరణించింది. దీనితో సోదరి భార్గవి మరణంతో తన చెల్లెలు, సోదరుడు అనాథలుగా మిగిలారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు ఆమె ఇంటికి వెళ్లి చెల్లెలు, సోదరుడుకి అండగా ఉంటామని చెప్పారట. టీం తారక్ ట్రస్ట్,ఎన్టీఆర్ ఛారిటబుల్ సర్వీసెస్ అనే రెండు ట్రస్ట్ ల ద్వారా వాళ్ళ చదువులు.. ఇతర అవసరాలు తీర్చడానికి ముందుకు వచ్చారు. దీనితో ఇప్ప్పుడు ఎన్టీఆర్ అభిమానులపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా “రౌద్రం రణం రుధిరం ” లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. అలియా భట్ , ఒలీవియా కథానాయికలు కాగా అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: