అది వైరస్ కంటే ప్రమాదకరం..!

Tollywood Director Koratala Siva Urges Everyone To Act Responsible By Getting Corona Virus Test As and When They Find Any Virus Symptoms

కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇస్తూనే వున్నాయి. ఇక ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ కూడా ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని.. సోషల్ డిస్టన్స్ మెయిన్ టైన్ చేయాలని.. చెబుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే లాక్‌డౌన్‌లో సడలింపులు చేశారో కరోనా భీభత్సంగా వ్యాపించడం మొదలైంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల విషయంలో భారత్ 3వ స్థానంలో ఉందంటే ఏ రేంజ్‌లో కరోనా ఉదృతి ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రజల నిర్లక్ష్య ధోరణి కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. తాజాగా ఇదే విషయంపై దర్శకుడు కొరటాల శివ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొంతమంది కరోనా పాజిటివ్ అని తెలిసినా దానిని చెప్పకుండా దాచి ఉంచుతున్నారు.. ఇది వైరస్ కంటే ఇంకా డేంజర్ అని అన్నారు. మరో ట్వీట్ లో దానిని రహస్యంగా దాచకుండా, ఈ విషయాన్ని మీ సన్నిహితులకు, మీరు ఎవరెవరినైతే కలిశారో వారికి తెలియజేయండి. తద్వారా వారు కూడా టెస్ట్‌లు చేయించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాల్సిన సమయమిది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం కొరటాల చిరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + nineteen =