వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో మహేష్ బాబు సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు కరోనా టైమ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు , ఏదైనా మంచిపని జరిగితే అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మహేష్ బాబు ట్విట్టర్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. మహేష్ బాబు ఇప్పుడు సోషల్ మీడియా లో తన డిస్ ప్లే , ప్రొఫైల్ పిక్చర్స్ ను మార్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చాలామంది సెలబ్రిటీస్ తరచూ సోషల్ మీడియా లో పిక్స్ ను మారుస్తున్న విషయం తెలిసిందే. కానీ మహేష్ బాబు చాలా కాలం గా ఒకే పిక్ ను మెయిన్ టైన్ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు డిస్ ప్లే , ప్రొఫైల్ పిక్స్ ను మార్చారు. ఆ రెండు ఫొటోలు కొత్త వి కావడం విశేషం. ఆ ఫొటోస్ ను చూసి మహేష్ బాబు అభిమానులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం” మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న “సర్కారు వారి పాట ” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ తరువాత మహేష్ బాబు నటించే “సర్కారు వారి పాట ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: