అందుకే సోషల్ మీడియా కు దూరం – ఇప్పుడు విస్కీ ఒక‌టే ఉంది..!

Actress Anupama Paresmeswaran Reveals The Reason Why She Was Not Active On Social Media For The Past Few Days

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీస్ సడెన్ గా సైలెంట్ అయితే నెటిజన్స్, ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలు పెడతారు. అంతేకాదు పలు వార్తలు కూడా వచ్చేస్తాయి. గతంలో సమంత కూడా కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఇంకేముంది ఏకంగా సమంత ప్రెగ్నెసీ అనే వార్తలు రాసేశారు. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కు కూడా అలానే జరిగింది. ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ … ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ యాక్టీవ్ గా ఉండేఅనుపమ.. గత కొన్ని రోజులుగా త‌ను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు. అయితే దీనికి కార‌ణం ఏంటో చెబుతూ ఓ వీడియోను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘నేను అడాప్ట్ చేసుకున్న విస్కీ, ర‌మ్మీ, టోడీ మూడు పెంపుడు జంతువుల‌లో రెండు “పార్వోవైరస్” కార‌ణంగా చ‌నిపోయాయి. మే 27న టాడీ, రమ్ వైరస్ వ్యాధిన పడ్డాయి. అప్పటి నుంచి ప్రతీ రోజు వాటి గురించి ఆలోచిస్తూ ట్రీట్‌మెంట్ ఇప్పించాను. ఇప్పుడు నాకు విస్కీ ఒక‌టే మిగిలి ఉంది. ఈ వైర‌స్ నుంచి మూగ‌జీవాల‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకోండి. ఇది టీకాలు వేసిన కుక్క‌ల‌ను కూడా ప్ర‌భావితం చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది‌. గత కొద్దిరోజులుగా మాములు మనిషి కావడానికి ప్రయత్నించినా.. కానీ నా వల్ల కాలేదంటూ భావోద్వేగం అయింది.

ఇక ప్రేమమ్ మలయాళ, తెలుగు చిత్రాలతో వెండి తెరకు పరిచయమైన అనుపమ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మనియారాయిలే అశోకన్ అనే మలయాళం చిత్రంలో, థాలీ పొదతే అనే తమిళ చిత్రంలో నటిస్తుంది. ఇంకా తెలుగులో కార్తికేయ2 సినిమాలో కూడా అనుపమ నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 17 =