ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా వచ్చిన `కె.జి.ఎఫ్- చాప్టర్ 1` సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రఖ్యాత హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించగా, కన్నడలో 100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం హిందీలో సుమారు 50 కోట్లు వసూలు చేసింది. ఇక అదే జోష్ తో `కె.జి.ఎఫ్- చాప్టర్ 2′ కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ పై ఏదో ఒక వార్త బయటకు వస్తూనే వుంది. ఇప్పటికే నిర్మాత కార్తీక్ గౌడ.. .30 రోజుల షూటింగ్ మిగిలి ఉందని, రెండు ఫైట్స్ మినహా షూటింగ్ పూర్తయ్యిందన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, జూలైలో ప్రభుత్వం షూటింగ్కి అనుమతిచ్చినా అక్టోబర్ 23నే సినిమాను విడుదల చేస్తామని కార్తీకగౌడ తెలిపారు. ఇప్పుడు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై హీరో యశ్ స్పందిస్తూ కె.జి.ఎఫ్- చాప్టర్ 2ను ఓటీటీ లో రిలీజ్ చేసే ప్రసక్తే లేదు.. బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేసేలా రూపొందిస్తున్నాం. డైరెక్టర్ ప్రశాంత్ కు , నాకు తెలుసు ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో.. పార్ట్ వన్ కంటే రెండో భాగం ఇంకా ప్రతిష్టాత్మకంగా ఉండాలని అభిమానులు భావిస్తున్నారు. వారిని నిరాశకు గురి చేయాలనుకోవడం లేదు’’ అన్నారు . మరి ఇప్పటికైనా రూమర్స్ ఆగుతాయా?లేదా? చూద్దాం.
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో.మరి చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చుద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: